ఏపీ లో కరోనా ఉధృతి క్రమక్రమంగా తగ్గుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 8 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,901 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,06,029 కు చేరింది. ఇందులో 28,770 కేసులు యాక్టివ్ గా ఉంటె, 7,70,653 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 19 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6,606 కు చేరింది. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే, అనంతపురంలో 21, చిత్తూరులో 289, తూర్పుగోదావరి జిల్లాలో 313, గుంటూరులో 295, కడపలో 85, కృష్ణాలో 74, కర్నూలులో 63, నెల్లూరులో 98, ప్రకాశంలో 104, శ్రీకాకుళంలో 18, విశాఖపట్నంలో 85, విజయనగరంలో 59, పశ్చిమ గోదావరిలో 397 కేసులు నమోదయ్యాయి.
previous post
ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం… బాలకృష్ణ వ్యాఖ్యలపై సి.కళ్యాణ్