సూపర్స్టార్ మహేష్ హీరోగా దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర, తమ్మిరాజు, రామ్లక్ష్మణ్, యుగంధర్ టి. ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. కాగా డిసెంబర్ 28న జరిగిన విశాఖ ఉత్సవ్ లో మంత్రి అవంతి శ్రీనివాస్ చేతులమీదుగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండి “డాంగ్ డాంగ్” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి డాన్స్ చేయడం ప్రేక్షకాభిమానుల్ని అలరించింది. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకుల కోరికపై డాంగ్ డాంగ్ పాటకు డాన్స్ వేసి ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ వీడియో సాంగ్ ప్రోమో 5 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.
previous post