telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీఆర్​ఎస్​ పార్టీ మున్పిపల్​ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలి; పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్​

ఆదివారం సాయంత్రం సిట్ విచారణ ముగిసిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్​ భేటీ అయ్యారు.

బీఆర్​ఎస్​ పార్టీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా అనుకూలంగా ఉందని, మున్పిపల్​ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని కేసీఆర్​ సూచించారు.

తెలంగాణ భవన్​లో ఉన్న బీఆర్​ఎస్​ ప్రజా ప్రతినిధులు నేతలు కేటీఆర్, హరీశ్​రావు, ఆర్ఎస్​ ప్రవీణ్ ​కుమార్ తదితరులతో నందినగర్​ నివాసంలో కేసీఆర్​ను కలిశారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలారని అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు చేశారని నేతలు తెలిపారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతుందని, చాలా మంది నేతలు బీఆర్​ఎస్​లో చేరుతున్నారని తెలిపారు.

అలాగే రెబెల్స్​ లేకుండా చూసుకోవాలని, అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడాలని నేతలకు సూచించారు.

ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ పరిస్థితి గురించి ఆరా తీశారు. శ్రేణులను సమన్వయం చేసి గెలిపించాలని కేసీఆర్​ నేతలకు సూచించారు.

Related posts