ఆదివారం సాయంత్రం సిట్ విచారణ ముగిసిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా అనుకూలంగా ఉందని, మున్పిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని కేసీఆర్ సూచించారు.
తెలంగాణ భవన్లో ఉన్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నేతలు కేటీఆర్, హరీశ్రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులతో నందినగర్ నివాసంలో కేసీఆర్ను కలిశారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలారని అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు చేశారని నేతలు తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతుందని, చాలా మంది నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
అలాగే రెబెల్స్ లేకుండా చూసుకోవాలని, అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడాలని నేతలకు సూచించారు.
ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ పరిస్థితి గురించి ఆరా తీశారు. శ్రేణులను సమన్వయం చేసి గెలిపించాలని కేసీఆర్ నేతలకు సూచించారు.


కాంగ్రెస్ లో ఉత్తమ్ తప్ప మరెవ్వరూ ఉండరు..రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు