“వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా తో అతి పెద్ద విజయం అందుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం మాస్ కమర్షియల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరికొత్త లుక్తో ప్రేక్షకులను అలరించనున్నాడు. అయితే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. బాక్సర్ పాత్రలో కనిపించనున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం బాగా ట్రైనింగ్ తీసుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలో కి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయ్ ఈ కొత్త లుక్కు సూపర్ రెస్పాన్స్ రాగా ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. . ఈ క్రమంలో లైగర్ నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
“లైగర్” లో సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఒక స్టార్ సెలబ్రిటీ ఉండబోతున్నారట. ఆ సెలబ్రిటీ రాక సినిమాకే హైలైట్ గా నిలువనుందని సమాచారం. అయితే ఆ సెలబ్రిటీ మరెవరో కాదు మైక్ టైసన్ అని ఇండస్ట్రీ వర్గాల విశ్లేషణ. మైక్ టైసన్ పాత్ర రాకతో కథ ఉన్నట్టుండి మలుపు తిరుగుతుందని కొందరు చెబుతున్నారు.
అయితే ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్ర గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. రమ్యకృష్ణ మరియు మకరంద్ దేష్పాండే ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.
కేవలం సోషల్ మీడియాలోనే దీని గురించి చర్చ… పిల్లలపై అనుష్క రియాక్షన్