త్రిష, సిమ్రాన్లు ఆల్ ఇన్ ఫిక్చర్స్ బ్యానరుపై తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వీరిద్దరూ యాక్షన్ హీరోయిన్లుగా కనిపించనుండటం విశేషం. ’96’ చిత్రం త్రిషకు మంచి గుర్తింపు నిచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు. ‘సదురం 2’ అనే థ్రిల్లర్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు సుమంత్.
ఈ సినిమా గురించి నిర్మాత విజయరాఘవేంద్ర మాట్లాడుతూ ‘ఇద్దరు ప్రముఖ నాయికలతో తెరకెక్కుతున్న తొలి యాక్షన్ సినిమా ఇది. చాలా ఆసక్తికరంగా సినిమా ఉంటుంది. చెన్నై, పిచ్చావరం, కేరళ, థాయ్లాండ్ తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాలని అనుకున్నాం. ఈ సినిమా కోసం సిమ్రాన్, త్రిషలు సముద్ర సంబంధిత సాహస క్రీడలల్లో శిక్షణ పొందుతున్నారు. వీరితోపాటు ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారని’ పేర్కొన్నారు.