తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఎనై నోకి పాయుమ్ తూటా’. ఈ సినిమా తెలుగులో ‘తూటా’ పేరుతో విడుదలవుతోంది. మేఘా ఆకాష్ కథానాయిక. విజయభేరివారి బ్యానర్పై జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. రానా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు శశి కుమార్, ధనుష్ అన్నగా నటించాడు. సునైనా, సెంథిల్ వీరాస్వామి, వేల రామమూర్తి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ‘తూటా’ నవంబర్ 29న తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల కానుంది. దర్భుక శివ బాణీలు అందించారు. తాజాగా చిత్ర ట్రైలర్ని నాగార్జున విడుదల చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో ధనుష్ ముందు చాలా ఓపికగా ఉంటాడు. కాని ఓపిక నశించిన తర్వా నా దారికి ఎవడన్నా అడ్డు వచ్చాడంటే చచ్చాడే అంటూ వీరావేశంతో ఊగిపోతాడు. ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post