ఎన్జీకే చిత్రంలో సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్నారు. మే 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. అంతేకాదు చిత్రాన్ని ఎక్కువ థియేటర్స్లో విడుదల చేసి రికార్డు ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టేలా చూస్తున్నారు చిత్ర నిర్మాతలు.
సౌత్ కొరియాలోను ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. అక్కడ విడుదలవుతున్న తొలి తమిళ చిత్రం ఇదే కావటం విశేషం. ఇటీవల ఉయ్యారే అనే మలయాళ చిత్రం అక్కడ విడుదలై మంచి విజయం సాధించింది. సౌత్ కొరియాలో విడుదలైన తొలి మలయాళ చిత్రం ఇదే. జూన్ 1న సౌత్ కొరియా రాజధాని సియోల్లో ఎన్జీకే చిత్రం విడుదల కానుండగా, రెండు షోస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.