వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్లో శిక్షణ నిమిత్తం విచ్చిన విద్యార్థుల పై యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కొన్ని సెంటర్ లలో నిర్వహకులు ఇష్టానుసారాంగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మహాబూబ్ నగర్ జిల్లా లోని నాగవరంలోని నవోదయ కోచింగ్ సెంటర్లో దారుణం జరిగింది.
స్టూడెంట్ను కోచింగ్ నిర్వాహకుడు చితకబాదాడు. దెబ్బలు తాళలేక విద్యార్థి వంశీ(10) మృతిచెందాడు. మృతదేహంతో కోచింగ్ సెంటర్ ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. రూ.10 లక్షల పరిహారం ఇస్తామని కోచింగ్ సెంటర్ యాజమాన్యం ఒప్పించారు. కోచింగ్ సెంటర్ను డీఈవో సుశీందర్రావు సీజ్ చేశారు.