స్టార్ హీరో ఆర్యకు ఊహించని షాక్ తగిలింది. ఆర్యపై తాజాగా చీటింగ్ కేసు నమోదైంది. ఆర్య తనను మోసం చేశాడంటూ శ్రీలంకకు చెందిన ఓ మహిళ కేసు పెట్టింది. దీంతో ఆ విషయం కోలివుడ్ పరిశ్రమను షేక్ చేసింది. యువతి చేస్తున్న ఆరోపణలు నమ్మేలా లేకున్నా.. తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కరోనా లాక్ డౌన్తో కష్టాల్లో ఉన్నానని చెప్పి.. ఆర్య తన దగ్గర నుంచి ఏకంగా రూ. 70 లక్షలు తీసుకున్నాడని ఆ శ్రీలంక మహిళ ఆరోపణలు చేసింది. అంతేకాదు తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. ఇప్పుడు కాదని మోసం చేస్తున్నాడంటూ కంప్లైంట్ ఇచ్చింది. ఆర్యకు తాను పంపిన డబ్బు లావాదేవీల వివరాలు, ఆయనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయని ఆ మహిళ చెబుతోంది. అంతేకాదు ఆర్యకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా.. ఆ మహిళ ప్రధాని, తమిళనాడు సీఎం, హొం మినిష్టర్ ఆఫీసులను కూడా లేఖలో కోరినట్టుగా తెలుస్తోంది. కాగా.. ఈ కేసుపై ఏప్రిల్ 4న విచారణ జరుగనుంది. ఈ కేసులో ఏం అవుతుందో అనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
previous post
ఆమె బిగ్ బాస్ లోకి రెండోసారి ఫుల్లుగా తాగి ఎంట్రీ ఇచ్చింది… కమెడియన్ షాకింగ్ కామెంట్స్