నేడు ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో తలపడుతున్న సౌతాఫ్రికా టాస్ గెలిచి కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్తో మ్యాచ్కు దూరమైన సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ బంగ్లాతో మ్యాచ్లోనూ దూరమయ్యాడు. తొలి మ్యాచ్లో గాయపడిన ఆమ్లా స్థానంలో డేవిడ్ మిల్లర్, క్రిస్మోరీస్ టీమ్లోకి వచ్చినట్లు డుప్లెసిస్ చెప్పాడు.
ఫిట్నెస్ సాధించిన బంగ్లా సారథి మష్రాఫ్ మొర్తజా, తమిమ్ ఇక్బాల్ టీమ్లోకి వచ్చారు. తొలి మ్యాచ్లో ఓటమితో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని సఫారీలు భావిస్తున్నారు. సౌతాఫ్రికాపై గెలిచి శుభారంభం చేయాలని బంగ్లా ఆశిస్తోంది.