telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ సమావేశం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ నిన్న గవర్నర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ రోజు  రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. నిన్న గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది.

రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ చర్చించారు. రెండు రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు, సానుకూల వాతావరణం కోసం ముఖ్యమంత్రులు గవర్నర్‌తో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Related posts