telugu navyamedia
రాజకీయ వార్తలు

జైల్లో చిదంబరాన్ని కలిసిన సోనియా, రాహుల్

sonia and rahul appeal to court on case

ఐఎన్‌ఎస్‌ మీడియా కేసులో కేద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం గత మూడు నెలలుగా తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు జైల్లో చిదంబరాన్ని కలిశారు.

ఈ ఉదయం జైలు వద్దకు చేరుకున్న వారు, నేరుగా లోపలికి వెళ్లి, దాదాపు 20 నిమిషాలకు పైగా చిదంబరంతో సమావేశం అయ్యారు. ఆయన్ను పరామర్శించిన సోనియా, త్వరలోనే కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చినట్టు సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చిన సోనియా, రాహుల్, తమ కోసం ఎదురు చూస్తున్న మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు.

Related posts