telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సరిలేరు నీకెవ్వరు” మూడు వారాల వసూళ్ళు

Sarileru NIkevvaru

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు‘ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, విజయశాంతి, రావురమేష్, రాజేంద్రప్రసాద్, సంగీత తదితరులు కీలకపాత్రల్లో నటించారు. మూడో వారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. దీంతో మూడు వారాల్లో వసూలు చేసిన మొత్తం షేర్ రూ. 127.35 కోట్లకు చేరింది. ఈ మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో వసూలైందే అధికం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు వారాల్లో రూ.106.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ‘సరిలేరు నీకెవ్వరు’. అంతేకాకుండా, ‘బాహుబలి 2’, ‘అల వైకుంఠపురములో’, ‘బాహుబలి’ చిత్రాల తర్వాత అత్యధికంగా షేర్ వసూలు చేసిన నాలుగో చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ఓవర్సీస్‌లో మాత్రం నష్టాలు మూటగట్టుకుంది. ఓవర్సీస్‌లో ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్ రూ.1.50 కోట్ల మేర నష్టపోయారు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే సినిమా సూపర్ హిట్.

“సరిలేరు నీకెవ్వరు” సినిమా ప్రపంచ వ్యాప్తంగా 22 రోజుల్లో ప్రాంతాల వారీగా… :
నైజాం – రూ. 33.65 కోట్లు
సీడెడ్ – రూ. 14.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 17.98 కోట్లు
గుంటూరు – రూ. 9.63 కోట్లు
తూర్పుగోదావరి – రూ. 11.04 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 7.27 కోట్లు
కృష్ణా – రూ. 8.35 కోట్లు
నెల్లూరు – రూ. 3.86 కోట్లు
ఏపీ, టీఎస్ మొత్తం – రూ. 106.48 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 9.40 కోట్లు
ఓవర్సీస్ – రూ. 11.45 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం షేర్ – రూ.127.33 కోట్లు

Related posts