telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దూకుడు పెంచిన సాయిధరమ్‌ తేజ్‌

మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. అతడి నూతన చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ ఇంకా విడుదల కాకముందే మరో చిత్రాన్ని ఓకే చేశాడు. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కూడా. ఈ సినిమా ఓ మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. కార్తీక్ వర్మ భమ్ బోలేనాథ్ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించనున్నారు. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ జెండాపై సుకుమార్‌లు కలిసి నిర్మించనున్నారు. ఈ సినిమాను లాంఛనంగా హైదరాబాద్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా తేజ్‌కు చాలా స్పెషల్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తేజ్ తన సినీ కెరీర్‌లో మొట్టమొదటి సారి మిస్టికల్ థ్రల్లర్ కథాంశంతో సినిమా చేయనున్నాడు. మరి సరికొత్త సంవత్సరానికి సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తేజ్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలోని నటీనటులను ఇంకా ఎంపికచేయలేదు. మరి ఈ ప్రయేగం ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.

Related posts