తెలుగు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అందాల తార రమ్యకృష్ణ నేడు 41 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. శివగామి పుట్టిన రోజున ఆమె ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు రిప్లబిక్ చిత్ర యూనిట్. సెకం డ్ ఇన్నింగ్స్లోను క్షణం తీరక లేకుండా సినిమాలు చేస్తున్న రమ్య ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తోంది. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠి సినిమాకు రీమేక్గా వస్తోంది.
ఆ మధ్య జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్విన్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రంలోను కీలక పాత్ర పోషించింది రమ్యకృష్ణ. ఇందులోని ఆమె విశాఖ వాణిగా పాత్ర పోషిస్తున్నారు.
ఈ రోజు రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా చిత్రం నుండి లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో రమ్యకృష్ణ సీరియస్గా పవర్ ఫుల్ మహిళ రాజకియ నాయకురాలిగా కనిపించారు. కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 1న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించారు.