టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా ఈ హీరో కుటుంబంలో వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా మహేశ్ ఇంట వినాయక చవితి పండుగ జరుపుకున్నారు. అయితే ఈ సారి పర్యావరణ సహిత వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నారు. ఘనంగా పూజలు నిర్వహించడమే కాదు.. నిమజ్జనం కూడా అలాగే చేశారు. మట్టి గణేషుడిని ఇంట్లోని తొట్టిలో నిమజ్జనం చేయగా, ఆ కార్యక్రమంలో మహేశ్, నమ్రత, సితార, గౌతమ్ పాల్గొన్నారు.
నిమజ్జనం చేసే ముందు పూజలు చేసి ఆ తర్వాత గణేషుడికి బైబై చెప్పారు. ‘గణేశుడికి వీడ్కోలు ఎప్పుడూ ఉండదు. ఆ దేవ దేవుడి కృప మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ త్వరగా వస్తావని ఆశిస్తున్నాను అంటూ నమ్రత ఓ వీడియో తన ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
https://www.instagram.com/reel/CTzgiktBVzD/?utm_source=ig_web_copy_link