telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రుషికేశ్‌లో ఆశ్రమంలో సూపర్ స్టార్

Priyanka

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో “దర్బార్” చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి గుమ్మడికాయ కూడా కొట్టేసారు చిత్ర యూనిట్. తాజాగా రజినీకాంత్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోగా రజినీకాంత్‌కు ఇది 168వ సినిమా. ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తుంది. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్‌ అఫీషియల్‌గా ప్రకటించారు. రజినీకాంత్‌తో ‘రోబో’, ‘పేట’ సినిమాల తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను రజినీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్టు ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించనట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఇవాళ ఉదయం రుషికేశ్‌లోని స్వామి దయానంద ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలో ఉన్న వారితో సరదాగా ముచ్చటించారు. ఆశ్రమానికి వచ్చిన వారు తలైవాతో ఫొటోలు దిగారు. గంగానదీ తీర ప్రాంతంలో ఉండే స్వామి దయానంద ఆశ్రమం ప్రముఖ పర్యాటక క్షేత్రం. దయానంద ఆశ్రమంలో వేద, సంస్కృత పాఠాలు, ప్రాచీన కాలంలో ఉన్న రుషుల చరిత్రలను బోధిస్తారు. యోగా తరగతులు కూడా కొనసాగుతుంటాయి.

Related posts