telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఆ నగలు .. గీటుగా తేల్చిన అధికారులు.. విస్తుపోయిన కార్మికులు..

police clarity on theft jewelry

చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఐదు రోజుల క్రితం నగరంలోని మార్కెట్‌ చౌక్‌ వద్ద ఉన్న బాణాలవీధిలో మురుగునీటి కాలువలోకి దిగి వ్యర్థాలను తొలగిస్తున్నారు. వారి చేతికర్రకు లోపల నుంచి ఓ రాయి అడ్డు తగినట్లు అనిపించింది. ఎంత ప్రయత్నించినా కర్రతో తీయడం సాధ్యపడలేదు. దీంతో కాలువలోకి దిగి దాన్ని చేత్తో బయటకు తీసి చూస్తే అది రాయి కాదు.. ఓ సంచి. ఇద్దరు కార్మికులు కాస్త పక్కకు వెళ్లి సంచిని తెరచి చూడగా సంచిలో దాదాపు 5 కిలోలకు పైగా ఆభరణాలున్నాయి. ఇద్దరూ ఒకరు మోహం ఒకరు చూసుకోని చూసకోని..వెంటనే అలర్ట్ అయి ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి.. వాటిని ఇద్దరూ సమంగా పంచుకున్నారు. మరుసటి రోజు నుంచి ఏమీ తెలియనట్టు తమ విథులకు హాజరయ్యారు.

ఇంట్లో దాచిన ఆభరణాలను రోజూ చూస్తూ మురిసిపోయారు. కానీ పోలీసులు ఆ కార్మికుల ఇళ్ల తలుపులు కొట్టారు. మీకు కాలువలో దొరికన ఆభరణాలు ఎక్కడ అని ప్రశ్నించారు. సీసీ కెమెరా వీడియో చూపించడంతో చేసేదేమీలేక ఒప్పుకున్నారు. దొరికిన దాంట్లో కొంతైనా మాకు ఇస్తే ఉన్న కష్టాలు తీరిపోతాయని వేడుకున్నారు. కానీ అక్కడే వారికి పోలీసులు అదిరిపోయే ట్విస్టు ఇచ్చారు. అవి బంగారం కాదు గిల్టు నగలు అని చెప్పడంతో బేల మొహాలు వెయ్యడం ఇద్దరి వంతయ్యింది. చిత్తూరు జిల్లాలోని యాదమరి మండలం ఆంధ్రాబ్యాంకులో పది రోజుల క్రితం చోరీకి గురైన ఆభరణాల్లో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న అప్రైజర్‌ రమేష్‌ గిల్టు నగలను బ్యాంకులో ఉంచి రుణం పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడిని తమదైన శైలిలో విచారిస్తే వీటిని పడేసిన కాలువను చూపించాడు. సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా పారిశుద్ధ్య కార్మికుల వద్ద ఉన్న గిల్టు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts