telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మొదటిసారి .. తెలుగు వారిని విడదీసి మాట్లాడిన ..పవన్ కళ్యాణ్.. పట్టుదలేది..

pavan kalyan on ycp and tdp

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునే విషయంలో తెలంగాణ ప్రజలకు ఉన్న బలమైన ఆకాంక్షను, ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రావాసులు చూపించలేకపోయారని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణవాసుల్లోని పట్టుదల ఏపీ ప్రజల్లో లేకపోయిందని ఆన్నారు.

దశాబ్దాల పాటు తెలంగాణ కోసం పోరాటం జరిగిందని, హోదా విషయంలో మాత్రం అలా జరగలేదని గుర్తు చేశారు. హోదాపై చంద్రబాబునాయుడు పలుమార్లు మాట మార్చినా, ప్రజల నుండి సరైన నిరసన రాలేదని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి నిరసన రానందునే, తామేమీ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. హోదా సాధన విషయంలో ప్రజలకు, పాలకులకు బలమైన ఆకాంక్ష ఉండాలని సూచించారు.

Related posts