telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఇక నుండి ప్రతి ఏడాది .. పసుపు-కుంకుమ.. ఇస్తా .. : చంద్రబాబు

CM Chandrababu fire to CEC

డ్వాక్రా మహిళలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ముంగిట హామీల వర్షం కురిపించారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, కోటి మంది చెల్లెమ్మలు ఉన్న ఏకైక అన్నయ్య ఈ ప్రపంచంలో తాను తప్ప మరొకరులేరని ఉప్పొంగిపోయారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలపై ఎల్లలులేని అనురాగం ప్రదర్శించారు. కొన్నిరోజుల క్రితం తాను పసుపు-కుంకుమ మూడు సార్లు ఇస్తానని చెప్పానని, ఇప్పుడు ఆలూరు సాక్షిగా మూడు సార్లు కాదు, ప్రతి ఏడాది పసుపు-కుంకుమ ఇస్తానంటూ హామీ ఇచ్చారు.

ఇప్పటివరకు ఐదేళ్ల వ్యవధిలో మూడు పర్యాయాలు పసుపు-కుంకుమ పథకం అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడా ప్రకటనను సవరిస్తూ, ఏడాదికోసారి ఇస్తామంటూ సభాముఖంగా చెప్పారు. తుది విడత చెక్కులు కూడా బ్యాంకులో వేశామని, వెళ్లి నగదు తెచ్చుకోవాలని సూచించారు. చెల్లెమ్మలు ఇంటింటికీ తిరిగి తెలుగుదేశాన్ని గెలిపించే బాధ్యతను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts