దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వ్యక్తిగత, రాజకీయ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వర్మ నిన్న ఉదయం 9.27 గంటలకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను కేవలం 24 గంటల్లో 40 లక్షల మంది వీక్షించారు. దీనిపై వర్మ హర్షం వ్యక్తం చేశారు. వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కేవలం 24 గంటల్లో లక్ష్మీస్ ‘ఎన్టీఆర్ ట్రైలర్’ ను 40 లక్షల మంది వీక్షించారు. ఆ దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు. ఎన్టీఆర్ కు మేమంతా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం’ అని ట్వీట్ చేశారు. దీనికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ లింక్ ను జతచేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ కోటి వ్యూస్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైలర్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ చిత్రాన్ని “ఎన్టీఆర్ : మహానాయకుడు” సినిమా విడుదలపై ఉంటుందని ఇంతకుముందే వర్మ ప్రకటించారు.
previous post
కేంద్ర మంత్రిపై ఫైర్ అయిన హీరో