అమోల్ సేన్ గుప్తా దర్శకత్వంలో బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సైనా పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ని హీరోయిన్గా తీసుకున్నారు. సైనా పాత్రలో నటించడానికి సిద్ధపడిన శ్రద్ధాకపూర్ సైనా కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద నెల రోజుల పాటు బ్యాడ్మింటన్లో శిక్షణ కూడా తీసుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి శ్రద్ధను తప్పించి ఆమె స్థానంలో పరిణితి చోప్రాను తీసుకుంటున్నట్లు టీ సిరీస్ సంస్థ అధినేత భూషణ్కుమార్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ ‘‘సైనా నెహ్వాల్ బయోపిక్లో నటించబోతున్న పరిణీతి చోప్రాకు స్వాగతం’’ అంటూ ట్వీట్ చేశారు భూషణ్ కుమార్. త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసి 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. షూటింగ్ సమయంలో శ్రద్ధాకపూర్కి డెంగ్యూ ఫీవర్ రావడంతోనే ఆమెను సినిమా నుంచి తప్పించారని అంటున్నారు. కానీ ఇప్పుడు శ్రద్ధా కపూర్ ఫీవర్ తగ్గి ఆరోగ్యంగానే ఉంది. పైగా ఇప్పుడు సినిమా షూటింగుల్లో కూడా పాల్గొంటోంది. అయితే గతంలో కూడా శ్రద్ధా కపూర్ “సైనా నెహ్వాల్” బయోపిక్ విషయమై అశ్రద్ధ వహిస్తోందని సైనా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.