దేశం గర్వించదగ్గ గాయని లతామంగేష్కర్ ను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. లతామంగేష్కర్ గత కొన్నిరోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యతో లత మూడు వారాల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలోని వెంటిలేటర్పై ఆమెను ఉంచి, వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో ఆమె త్వరగా కోలుకోవాలని యావత్ సినీరంగంతో పాటు ఆమె అభిమానులు ప్రార్థనలు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కాస్త మెరుగపడింది. దీంతో ఆమెను జనరల్ వార్డులకు షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. కాగా లతా మంగేష్కర్ సెప్టెంబరు 28న తన 90 పుట్టినరోజును జరుపుకున్నారు. కాగా లతా మంగేష్కర్ పాటలు ఎంత వినసొంపుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పాటలని వింటూ పెద్ద వాళ్ళే కాదు చిన్నారులు కూడా మైమరచిపోతారు. ఇటీవల కోల్కత్తా రైల్వే స్టేషన్లో రణు మొండల్ అనే మహిళ లతా మంగేష్కర్ పాటని ఆలపించగా, ఆమె పాట కొద్ది గంటలలోనే ఫుల్ వైరల్ అయింది. దీంతో ఆమెకి ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. ఇక రెండేళ్ళ చిన్నారి లతా పాడిన ..లగ్ జా గాలే అనే పాటని అద్భుతంగా ఆలపించింది.ఆ పాప వీడియోని జూలైలో సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఫుల్ వైరల్ అయింది. ఆ చిన్నారి పేరు ప్రగ్యా అని తెలుస్తుండగా, ఆ పాప పాడిన పాటకి నెటిజన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.
previous post
next post