telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా మీద ఐటీ దాడులు చేసి ఉంటే… నవదీప్ వ్యాఖ్యలు

Navadeep

తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ప‌లు చిత్రాలు చేశాడు యంగ్ హీరో న‌వ‌దీప్. అంతేకాదు అనేక టీవీ షోలకు వ్యాఖ్యాతగా కూడా ఉన్నాడు. 2004లో వ‌చ్చిన “జై” సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన హీరో న‌వ‌దీప్‌ ఇప్పుడు కేవ‌లం స‌పోర్టింగ్ క్యారెక్టర్స్ మాత్ర‌మే చేస్తున్నాడు. ప్రస్తుతం న‌వ‌దీప్ అల్లు అర్జున్ 19వ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ఆయ‌న సిక్స్ ప్యాక్ లుక్ సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొద్ది రోజులుగా గంట‌ల‌పాటు జిమ్‌లో శ్ర‌మించిన న‌వ‌దీప్ కండ‌లు తిరిగిన దేహంతో బాలీవుడ్ హీరో లుక్‌లో కన్పించి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు నవదీప్. కాగా… బుధ‌వారం రోజు టాలీవుడ్ నిర్మాతలు, హీరోల‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు ఆక‌స్మిక దాడి జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ముందుగా నిర్మాత సురేష్ బాబు ఇళ్లు, కార్యాల‌యాల‌లో ఐటీ దాడులు జ‌ర‌గ‌గా, ఆ త‌ర్వాత వెంక‌టేష్‌, నాని ఇల్లు, ఆఫీసుల‌లోను దాడులు నిర్వ‌హించారు. వ‌రుస దాడుల‌తో టాలీవుడ్‌, నిర్మాత‌ల‌లో కంగారు మొద‌లైంది. అయితే దీనిపై యంగ్ హీరో న‌వ‌దీప్ దీనిపై ఫ‌న్నీ ట్వీట్ చేశారు. ఇన్‌కంట్యాక్స్ అధికారులు నా మీద దాడి చేసి ఉంటే, వాళ్ళే కొంత మ‌నీని నా ద‌గ్గ‌ర వ‌దిలేసి వెళ్ళేవారు అనే కామెంట్ పెట్టారు. దీంతో పాటు బిల్ బ్యాండ్ బాజా అనే హ్యాష్ ట్యాగ్ కూడా త‌న కామెంట్‌కి జ‌త‌చేశాడు న‌వ‌దీప్. 

Related posts