telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నారా లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడలో 24 గంటల రిలే నిరాహారదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షాస్థలికి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేరుకొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి బయల్దేరారు. మార్గమధ్యలో కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లోకేశ్ తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే రామానాయుడును, మరో ఇద్దరు నేతలను కూడా అరెస్ట్ చేశారు. అయితే, వీరిని కలెక్టరేట్ మీదుగా తొట్లవల్లూరు వైపు తీసుకెళ్లారు. పార్టీ ఆఫీసుకు వెళ్తున్నానని లోకేశ్ చెబుతున్నప్పటికీ పోలీసులు వినకుండా అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts