రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్లో కూడా లిప్లాక్ సన్నివేశాలను చూపించారు. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ కంప్లీటైంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ “ధనుష్తో కలిసి ఓ తమిళ సినిమాలో నటించడానికి ఓకే చెప్పా. అయితే ఆ సినిమా అనూహ్యంగా ఆగిపోయింది. 35 రోజులు షూట్ కూడా చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఆ సినిమా ఆగిపోయిందని తెలిసి షాకయ్యా. ఇప్పుడు హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నా. ఇది చాలా గొప్ప సినిమా. నాకు సీరియస్గా సాగే సినిమాలంటే నచ్చదు. ఫన్నీగా, రొమాంటిక్గా ఉండే సినిమాలనే ఇష్టపడతా. నా కెరీర్లో చాలా ప్రయోగాలు చేశా. అలాగే కొన్ని తప్పులు కూడా చేశా. వాటి నుంచి చాలా నేర్చుకున్నా. ద్విభాషా సినిమాలు చేసి మార్కెట్ పెంచుకోవాలని నాకూ ఉంది. గతంలో కొన్నిసార్లు ప్రయత్నించాను. అయితే వర్కవుట్ కాలేదు” అని అన్నారు.
next post
పవన్ పై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు