సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మహేష్ కు భారీ విజయాన్ని అందించింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. కాగా సినిమా ప్రమోషన్స్ అంతా పూర్తి చేసుకున్న మహేష్ కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం అమెరికా పయనమయ్యారు. అయితే రెండు నెలలు పాటు మహేష్ బాబు అమెరికాలోనే ఉంటారని వార్తలు వచ్చాయి. అయితే మహేష్ అమెరికా వెళ్లడానికి అసలు కారణం వేరే ఉందంటూ మరికొన్ని వార్తలు వినపడుతున్నాయి. ఈ వార్తల సారాంశం ఏంటంటే… మహేష్ బాబుకు మోకాలి ఆపరేషన్ జరగనుందట. “ఆగడు” సినిమా షూటింగ్ సమయంలో ఆయన కాలికి గాయమైందట. ఆ గాయం ఇబ్బంది పెడుతూ వచ్చిందట. మరీ ఇబ్బందిగా మారకముందే జాగ్రత్త అవసరమని భావించిన మహేష్ ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వెళ్లాడని టాక్. ఆపరేషన్ సహా ఐదారు నెలలు మహేష్ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారని టాక్. అంతా సెట్ అయిన తర్వాతే మహేష్ తదుపరి సినిమా సెట్స్ పైకి వెళుతుందని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మహేష్ స్పందించాల్సిందే.
previous post