హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని కొందరు అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.
ఈ దారుణ ఘటన కేసులో నిందితులను పోలీసులు పట్టుకుంటారన్న విశ్వాసముందని తెలిపారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరుగుతుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రియాంకారెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే డయల్ వెంటనే 100 నంబరుకి ఫోన్ చేసి సాయం కోరవచ్చని ఆయన తెలిపారు.
రోజా నేను మంచి స్నేహితులం: ప్రియారామన్