సూపర్స్టార్ మహేష్ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మహేశ్ నటిస్తోన్న 26వ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర ప్రమోషన్స్లో వేగాన్ని పెంచారు. డిసెంబర్ నెలలో ఉండే ఐదు సోమవారాలలో ప్రతి సోమవారం రోజు ఒక్కో సాంగ్ విడుదల కానుందని, ఇది మహేష్ తన అభిమానులకి ఇచ్చే ట్రీట్ అని చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలియజేసింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సారి మహేష్ సినిమా కోసం దేవి ఎలాంటి బాణీలు రెడీ చేశాడో చూడాలి. “సరిలేరు నీకెవ్వరు” చిత్రం జనవరి 11న విడుదల కానుంది.