లాక్డౌన్ కారణంగా అందరు సెలబ్రిటీలు ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటున్నారు. దీంతో ఒకరికొకరు డిఫరెంట్ ఛాలెంజెస్ విసురుకుంటున్నారు. తాజాగా ఇండస్ట్రీలో ‘బీ ది రియల్ మెన్’ ఛాలెంజ్ నడుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి ప్రారంభించిన ఈ ఛాలెంజ్ను రాజమౌళిని నామినేట్ చేసాడు. రాజమౌళి కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా పులువురిని నామినేట్ చేసారు. ఇక ఎన్టీఆర్ కూడా బాబాయి బాలకృష్ణతో పాటు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్లతో పాటు డైరెక్టర్ కొరటాల శివను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే చిరంజీవి ఈ ఛాలెంజ్ను స్వీకరించారు. ఎన్టీఆర్ ఛాలెంజ్ను బాలయ్య ఎలా స్వీకరిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మొన్నటి వరకు సోషల్ మీడియకు దూరంగా ఉన్న చిరంజీవి.. ఉగాది సందర్భంగా అడుగుపెట్టి పూటకో పోస్ట్తో అభిమానులకు చాలా దగ్గరగా ఇంట్రాక్ట్ అవుతున్నారు. బాలయ్య కూడా ఈ ఛాలెంజ్తో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వాలని బాలయ్య ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఛాలెంజ్ను బాలకృష్ణ ఏ విధంగా రియాక్షన్ ఇస్తారా అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
previous post
సర్జికల్ స్ట్రైక్స్ పై రామ్ చరణ్ కామెంట్