telugu navyamedia
సినిమా వార్తలు

సర్జికల్ స్ట్రైక్స్ పై రామ్ చరణ్ కామెంట్

Ram Charan images

కొన్ని రోజుల క్రితం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యంతోపాటు ప్రతీ భారతీయుడు ఆగ్రహంతో ఉడికిపోయాడు. ఈ ఉగ్రదాడిలో 40 మందికిపైగా భారత జవాన్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉగ్రవాదులపై ప్రతీకార చర్యగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈరోజు ఉదయం 3 గంటలకు జైషే మొహమ్మద్ టెర్రర్ క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ పై టాలీవుడ్ సినీనటుడు రామ్ చరణ్ స్పందించారు. “ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. జైహింద్” అంటూ దానికి ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేసి పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

Related posts