జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి కొడాలి నాని వింర్శనాస్త్రాలు సంధించారు. తమ ప్రభుత్వాన్ని గుర్తించడానికి పవన్ ఎవరు? ఆయన్ని ప్రజలే గుర్తించలేదని, అందుకే, పోటీ చేసిన రెండు చోట్లా ఓడించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ‘తానా’ అంటే పవన్ కల్యాణ్ ‘తందానా’ అంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ఘటన గురించి ఆయన ప్రస్తావించారు. మోసపోయామన్న బాధతోనే రైతులు దాడి చేశారని అన్నారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలాడినా తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని చెప్పారు.
జనసేన ను బీజేపీలో విలీనం చేసేందుకు పవన్ కల్యాణ్ భారీ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పొగడడం ద్వారా జనసేనను బీజేపీలో విలీనం చేస్తామన్న సంకేతాలిచ్చారని అన్నారు. జనసేన ను బీజేపీలో విలీనం చేయాలని స్వయంగా పవన్ కల్యాణే గతంలో చెప్పారని గుర్తుచేశారు.