బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రేమ పెళ్లి అనంతరం ఎక్కువగా లండన్లోనే గడుపుతోంది. ఏవైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నప్పుడే భారత్ కు వస్తోంది. ఇటీవలే సోనమ్ తన భర్త ఆనంద్ అహూజాతో పాటు ఒక కార్యక్రమానికి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ ఫొటోలు చూసినవారు సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్ ? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మస్టర్డ్ ఎల్లో కలర్ డ్రెస్ ధరించిన సోనమ్… తన డ్రెస్ కు సరిపోయే చెప్పులను ఎంచుకోగా, వాటిని ఆమె పాదాలకు తొడిగి, బెల్టులను ఆమె భర్త బిగించారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా సోసమ్, ఆనంద్ అహూజాల వివాహం 2018 మే 8న జరిగింది. ఆనంద్ అహూజా ప్రముఖ వ్యాపార వేత్తల కుటుంబానికి చెందినవాడు. సోనమ్ ఇటీవలే “ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా” చిత్రంలో నటించింది. ఈ సినిమా బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది.
previous post
వర్మ “పవర్ స్టార్” తీస్తే తప్పేంటి ?… ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్