కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన తర్వాత ఒక మెగా క్రికెట్ టోర్నీకి ఈరోజు తెరలేస్తోంది. కాసేపట్లో ఐపీఎల్ 2020 ప్రారంభంకానుంది. కరోనా నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ మన దేశంలో కాకుండా యూఏఈలో జరుగుతోంది. అబుదాబి, షార్జా, దుబాయ్ లు ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి.
ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తొలి మ్యాచ్ అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టోర్నీ పలు చానల్స్ లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు సిద్దమవుతున్నారు.