telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

కాసేపట్లో ఐపీఎల్ 2020 ప్రారంభం..!

ipl 2020 match

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన తర్వాత ఒక మెగా క్రికెట్ టోర్నీకి ఈరోజు తెరలేస్తోంది. కాసేపట్లో ఐపీఎల్ 2020 ప్రారంభంకానుంది. కరోనా నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ మన దేశంలో కాకుండా యూఏఈలో జరుగుతోంది. అబుదాబి, షార్జా, దుబాయ్ లు ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి.

ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తొలి మ్యాచ్ అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టోర్నీ పలు చానల్స్ లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు సిద్దమవుతున్నారు.

Related posts