అఖండ భరతం ఈసారి సరికొత్తగా డెబ్బై మూడవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. అటు జమ్మూకశ్మీర్ పై తీసుకున్న నిర్ణయం సహా దేశంలో ఉగ్ర దాడులు జరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో సందర్శకుల అనుమతిపై తాత్కాలిక నిషేధం విధించింది.
ఈ నెల 10 నుంచి 20 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. నిషేధాజ్ఞలను తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో ఆదేశించింది.