telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

సీబీఐ కూడా తమకు న్యాయం చేస్తోంది: డాక్టర్‌ సుధాకర్‌ తల్లి

sudhaker mother

విశాఖ డాక్టర్‌ సుధాకర్‌ తల్లి వేసిన హెబియస్‌ కార్పస్‌ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ పై ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు సుధాకర్‌ను డిశ్చార్జ్‌ చేయడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఆయన తల్లి కావేరి బాయ్‌ స్పందించారు. సీబీఐ కూడా తమకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు.

నిన్న సాయంకాలం వరకు ప్రభుత్వం నుంచి తనపై ఒత్తిడి తెచ్చిందన్నారు. సీబీఐ విచారణలో ఇంకా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయని చెప్పారు. మానసిక వైద్యశాలలో పెట్టి పూర్తిగా పిచ్చివాడిగా చూపించాలనే ప్రయత్నం చేశారని, తన బిడ్డకు చేసిన అన్యాయం ఒక్కొక్కటి బయటకు వస్తుందని కావేరి బాయ్‌ తెలిపారు.

Related posts