telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

కోర్టు హాలులో కాల్పులు.. ఇద్దరు లాయర్లు మృతి

gun fire

కోర్టు హాలులో విచారణ జరుగుతున్న సమయంలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు లాయర్లు మృతి చెందారు. ఈ ఘటన థాయ్‌లాండ్ లోని చందబురి ప్రొవిన్షియల్ కోర్టులో జరిగింది. ఓ వారసత్వ ఆస్తి వివాదానికి సంబంధించి కోర్టు రూంలో విచారణ జరుగుతుండగా ఈ ఘటన జరగడం గమనార్హం.

కోర్ట్ లో విచారణ జరుగుతున్న సమయంలో ఆగంతకుడు వచ్చి కాల్పులు జరిపాడు. ఆగంతకుడి చేతిలో ఇద్దరు లాయర్లు ప్రాణాలు కోల్పోగా..వెంటనే పోలీసులు ప్రతిఘటించి దుండగుడిని చంపినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ జరిగే కోర్టు రూంలో కాల్పులు జరిపే పరిస్థితి ఎందుకు వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts