telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అంతా సిద్ధం.. లెక్కింపు .. కొద్దిసేపటిలో ప్రారంభం..

మరి కాసేపట్లో.. దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాసాల వద్ద పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు పరిశీలకుడు కేకే శర్మతో ఈ విషయమై చర్చించినట్టు ఆయన తెలిపారు. ఫలితాల అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ద్వివేది వివరించారు.

Related posts