సూర్య హీరోగా నటిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తమిళ సినిమా ‘కప్పాన్’కు తెలుగు అనువాదమిది. తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే ఈ సినిమా కథ తనదంటూ చెన్నై క్రోమ్ పేటకు చెందిన జాన్ చార్లెస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల చేయకుండా ఆపాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. 10 సంవత్సరాల నుండి సినిమా రంగంలో పనిచేస్తున్నానని, తాను సరవెడి పేరుతో రాసుకున్నకథను డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్, కె.వి.ఆనంద్లకు చెప్పానని తెలిపారు. కె.వి .ఆనంద్ కథ విని నచ్చిందని తనకు అవకాశం కల్పిస్తానన్నారని, కానీ తన కథతోనే “బందోబస్త్” (కాప్పాన్) నిర్మించారని తెలిసి షాకయ్యానని జాన్ చార్లెస్ తెలిపారు. కాబట్టి “బందోబస్త్” చిత్రాన్ని విడుదల చేయకుండా నిషేధం విధించాలని కోర్టును కోరారు. పిటీషన్ను పరిశీలించిన న్యాయమూర్తులు కేసును సెప్టెంబర్ 4కి వాయిదా వేశారు.
previous post
next post
మాజీ భర్తపై హీరోయిన్ వ్యాఖ్యలు… చాలా బాధ పెట్టుకున్నాం… అందుకే ఈ నిర్ణయం