మల్కాజిగిరి లోక్సభ స్థానంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి పేరును అధిష్ఠానం ఖరారుచేసింది. దీంతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. 2014 ఎన్నికల్లోనే టీడీపీ తరఫున రేవంత్రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కొడంగల్ అసెంబ్లీ స్థానానికే పరిమితమయ్యారు.
అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. పార్టీ ఆదేశిస్తే తాను మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమేనని ప్రకటించిన విషయం తెలిసిందే. అధిష్టానం కూడా ఆయనవైపే మొగ్గు చూపి మొదటి జాబితాలోనే రేవంత్ కు అవకాశం కల్పించింది.