దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కూరగాయలు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి కూరగాయల పంట చేతికొచ్చిన సమయంలో తగిన రవాణా సదుపాయాలు లేక, పండించిన కూరగాయలను అమ్ముకునే మార్గం లేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారణాసిలో కూరగాయలు సాగుచేసే రైతులకు కొంత ఊరట లభించింది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరం నుంచి బ్రిటన్కు నాలుగు టన్నుల కూరగాయల ఎగుమతి అవుతున్నాయి. ఈ మేరకు పచ్చిమిర్చి, దోసకాయ, పొట్లకాయ, ఆనక్కాయ తదితర కూరగాయలను ఇప్పటికే ఎయిర్ కండిషన్డ్ కంటైనర్ల ద్వారా ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిర్ కార్గో ద్వారా లండన్కు చేరుకుంటాయని అధికారులు తెలిపారు.
బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: కన్నా