ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం స్పందించారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందని చంద్రబాబు గుర్తుచేశారు. తూర్పుకాపు, కళింగ, గవర వంటి సామాజికవర్గాలకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఏపీకి వచ్చి బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం దేశంలో మోదీ అనుకూల కూటమి, వ్యతిరేక కూటమి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, వైసీపీ మోదీ అనుకూల కూటమిలో ఉన్నట్లేనని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా బీజేపీ నేతలు కడపలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. రేపు కోల్ కతాలో జరిగే బీజేపీయేతర రాజకీయ పార్టీల ర్యాలీకి తాను వెళ్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్, వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు ఆ ర్యాలీకి హాజరవుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.
అమరావతిని దెబ్బతీయడంతో.. హైదరాబాద్ కు వలసబాట: చంద్రబాబు