తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్కు వెయింట్ లాస్ కాదు.. మైండ్ లాస్ అయ్యిందని ఘాటు వ్యాఖ్యలు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు..టీడీపీ ఒక డ్రామా కంపెనీ అని, నేపాల్ గుర్ఖాలకు సూటూ బూటూ తగిలించి ఎంవోయూలు చేసిన ఘనత చంద్రబాబు దని.. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
తమ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి భూములు ఇచ్చి, అనుమతులు ఇచ్చి. పెట్టుబడులు తీసుకొస్తుంటే.. అదంతా తమ ఘనతగా టీడీపీ ప్రచారం చేసుకుంటుందని విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. . అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తూ.. సుపరిపాలన అందిస్తున్నారన్నారు.
ఎలాగైనా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న టీడీపీ కల నెరవేరదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నతంకాలం టీడీపీకి అధికారం అనేది అందని ద్రాక్ష అని రాజకీయ విమర్శలు చేశారు. వార్డు సభ్యునిగా గెలవలేని నారా లోకేశ్, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్.భారతిల గురించి అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలన్నారు.
వైఎస్ భారతి రాజకీయాల్లో ఏ రోజైన బయట కనబడ్డారా అని ప్రశ్నించారు. ఏ రోజైనా రాజకీయంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నలు సంధించారు.
అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జనసేనపై కాపుల పార్టీ అని ముద్రవేస్తున్నారని అన్నారని.. అయితే అది కాపు జనసేన కాదని అన్నారు. పవన్ కల్యాణ్ నడుపుతుంది కాపు జనసేన కాదని.. కమ్మ జనసేన అని విమర్శించారు. నాదెండ్ల డైరెక్షన్ లో నడిచేది కమ్మ జనసేన అని, పవన్ నడిపేది కమ్మ జనసేన అని కాపులు పవన్ ను ఓన్ చేసుకునే పరిస్థితి లేదన్నారు.
ప్రధాని మోదీ దగ్గర వేషాలు వేయాల్సిన అవసరం మాకు లేదని ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అసలు బీజేపీతో ఉన్నారా అని ప్రశ్నించారు.
మిగతా విషయాలపై మాట్లాడే దమ్మే లేదు: విజయసాయి రెడ్డి