telugu navyamedia
Uncategorized

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఆగ్రహం…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… బైంసా లో మానవ హక్కుల ఉల్లంఘన , రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఈ ప్రభత్వం పోలీసులను ఎంఐఎం చెప్పు చేతల్లో పెట్టింది. పరిస్థితి ఇలానే ఉంటే శాంతి భద్రతల సమస్య గా మారుతుంది అని గవర్నర్ కి చెప్పాము. మహారాష్ట్ర నుండి బహిష్కరించి బడిన లుచ్చాలు బైంసా లో ఉన్నారు. హిందు కుటుంబాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఒక వైపు ప్రభుత్వం,మరోవైపు దుర్మార్గులు చేస్తున్నారు. పొడిచింది హిందువులనే ఆస్తుల ధ్వంసం అయింది హిందువులవే అరెస్ట్ హిందువులను చేస్తున్నారు  మానవత్వం లేని మానవ మృగం సీఎం కేసీఆర్. ఒక పసిపాప మీద అత్యాచారం జరిగితే సీఎం ,కాంగ్రెస్, కమ్యూనిస్టు లు స్పందించరా… ఇతర రాష్ట్రాల లో జరిగితే మాట్లాడే మీరు ఇక్కడ జరిగితే ఎందుకు మాట్లాడుటలేదు అని అన్నారు. సీఎం నీకు కుటుంబం ఉంది.. ఇదే పరిస్థితి ని కుటుంబం కి జరిగితే ఎలా ఉంటుంది ఆలోచించుకో.  పేద హిందువుల పై 3rd డిగ్రీ ఉపయోగిస్తున్నారు. ప్రగతి భవన్ లో కి మా కార్యకర్తలు ,నేను చొరబడతాం… సీఎం ని గల్లా పట్టుకొని బయటకు పట్టుకు వస్తాం అన్నారు.

Related posts