ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ తెలుగుతేజం పీవీ సింధు రాజ్భవన్లో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా సింధును గవర్నర్ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆమెను శాలువాతో సన్మానించారు. బ్యాడ్మింటన్లో సింధు ప్రపంచకప్ సాధించడం సంతోషంగా ఉందని, సింధును భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
కోచ్ గోపిచంద్ మంచి ఆటగాడని, తన శిష్కరికంలో ఇంకా అనేక మంది క్రీడాకారులను దేశానికి అందించాలని గవర్నర్ సూచించారు. అనంతరం పీవి సింధు మాట్లాడుతూ.. దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చేందుకు కృషి చేస్తానని, ప్రస్తుతం తనపై బాధ్యత మరిత పెరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, సింధు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.