అసెంబ్లీలో గురువారం జరుగనున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటానని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
ప్రొటెం స్పీకర్ సమక్షంలో తాను ప్రమాణ స్వీకారం చేయబోనని ఆయన పునరుద్ఘాటించారు. ఎంఐఎం సిద్ధాంతాలు వేరు, తమ సిద్ధాంతాలు వేరని ఆయన అన్నారు.
ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ముందు తాను ప్రమాణం చేయనని పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత తాను ప్రమాణ స్వీకారం చేస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు.
కేటీఆర్ ‘చిలక’ తో పోల్చిన చార్మినార్ ఎమ్మెల్యే…