హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ నడిరోడ్డు పై ఈ నెల 7న ప్రేమ జంట పై కత్తులతో దాడి చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు.
షేక్ ఇంతియాజ్, జైనాబ్ ఫాతిమాపై దాడి కేసులో సయ్యద్ ఫరూక్ అలీ, సయ్యద్ మోసిన్ అలీ, సయ్యద్ మహ్మద్ అలీ, సయ్యద్ అహ్మద్ అలీ, జకీరా బేగం, సయ్యద్ జబా ఫాతిమాను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రౌడీయిజం చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని డీసీపీ హెచ్చరించారు. దాడిలో షేక్ ఇంతియాజ్, జైనాబ్ ఫాతిమాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్పపొందుతున్నారు.
బొత్స తానే సీఎంలా మాట్లాడుతున్నారు: పవన్ విమర్శలు