కేంద్ర మంత్రిగా ఉంటూ రోడ్డు ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర నేత గోపినాథ్ ముండేది హత్యే అని సైబర్ నిపుణుడు, ఈసీఐఎల్ మాజీ ఉద్యోగి సయ్యద్ షుజా ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలను రిగ్గింగ్ చేశారని, ఆ విషయం ముండేకు తెలుసని ఆయన చెప్పారు. ఆయన బయట పెడతారనే ఆయనను చంపేశారని ఆయన ఆరోపించారు. ఈవీఎంల హ్యాకింగ్ గురించి ఇవాళ లండన్లో నిపుణల మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనాలని భావించిన సయ్యద్ షుజాపై నాలుగు రోజుల క్రితం దాది జరిగింది. దీనితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కేసుపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ) దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో కూడా గోపినాధ్ ది హత్యే అని గుర్తించారు అధికారి తంజీల్ అహ్మద్. ఆ ప్రకారం ఎఫ్.ఐ.ఆర్ రూపొందిస్తున్న తరుణంలో గోపినాధ్ తో కలిసి పనిచేసిన సయ్యద్ షుజా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పడంతో సందిగ్ధం నెలకొంది. షుజా 2009 నుంచి 2014 వరకు ఈజీఐఎల్లో పనిచేశారు. 2014లో వినియోగించిన ఈవీఎంల డిజైన్ చేసిన బృందంలో తాను ఉన్నట్లు షుజా తెలిపారు. ఈ హత్య వెనుక బీజేపీ హస్తం ఉందా…అయితే 2014 బీజేపీ ఘనవిజయం అంతా బూటకమేనా…!!
రోహిత్ శర్మను ఔట్ చేయడం డ్రీం… : పాకిస్థాన్ యంగ్ ప్లేయర్ నసీమ్ షా