telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఓయూలో కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్న పోలీసులు

uttam congress mp

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని భూములను పరిశీలించడానికి వెళ్ళిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వారితో వీహెచ్‌ వాగ్వివాదానికి దిగారు. వర్సిటీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని మండిపడ్డారు. తమను అడ్డుకోవడం సరికాదని చెప్పారు.

భూములను పరిశీలించడానికి వెళ్లినవారిలో వీహెచ్‌తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, వంశీచంద్‌రెడ్డి కూడా ఉన్నారు. ఓయూ భూముల్లో కొందరు నిర్మాణాలు చేపడుతుండడం పట్ల వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ భూములను సందర్శించడానికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు.ఓయూ భూములపై తాము త్వరలోనే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలుస్తామని ఉత్తమ్ తెలిపారు.

Related posts