telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ-బట్లర్ మధ్య ఏం జరిగింది…?

నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి 5 టీ20 ల ఈ సిరీస్ ను 3-2 తో సొంతం చేసుకుంది టీం ఇండియా. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడుతున్న జోస్‌ బట్లర్‌ ను కట్టడి చేసేందుకు భువనేశ్వర్‌ కుమార్‌ను రంగంలోకి దింపిన విరాట్ కోహ్లీ అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు.ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. ఆఫ్ స్టంప్‌కి చాలా వెలుపలగా బంతుల్ని వేస్తూ జోస్ బట్లర్‌ని ఇబ్బందిపెట్టాడు. దాంతో.. ఆ ఓవర్‌లో ఐదో బంతిని లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడిన బట్లర్.. బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యాకు చిక్కాడు. దాంతో విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. ఈ సంతోషంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ గట్టిగా అరించాడు. దాంతో బట్లర్ విరాట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెవిలియన్‌కి వెళ్తున్న అతను వెనక్కి వచ్చి మరీ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ కలగజేసుకుని ఇద్దరికి సర్దిచెప్పాడు. అయితే వారిద్దరి మధ్య ఏం జరుగుతుందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ కోహ్లీ సంబరాలు చేసుకుంటుండగా.. వెనక్కి వచ్చిన బట్లర్ నోర్మూయ్ విరాట్ అన్నట్లు అతని అహభావాలని బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Related posts